తుర్తుక్
లడఖ్ హిమాలయాల లోపల ఉండే ఈ గ్రామం స్వర్గం అనే పదానికి సరైన నిర్వచనాన్ని ఇస్తుంది. ఈ గ్రామం 1971 వరకు పాకిస్థాన్ భూభాగంగా ఉండేది. ఆ తరువాత భారతదేశం ఈ ప్రాంతంపై నియంత్రణను సాధించింది. దీంతో తిరిగొచ్చిన స్వర్గంగా ఈ ప్రాంతాన్ని పిలుస్తుంటారు. టూరిస్టులు ఈ ప్రాంతాన్ని ఇప్పుడు సందర్శించవచ్చు. హిమాలయాలలో మీరు ఊహించే కలల ప్రపంచం మీకు ఇక్కడ పరిచయం అవుతుంది.