INDIA NEWS: ఇది నిజంగా దారుణం అని అంటున్నారు. వారు విమానం ఎక్కలేదు, ప్రమాదంతో ఏ విధంగానూ చూసినా సంబంధం లేదు, కానీ నడి నెత్తిన పడిన అతి పెద్ద బోయింగ్ విమానం వారి ఉసురు అలా తీసింది. మృత్యువు ఏ రూపంలో వస్తుంది, ఏ విధంగా వస్తుంది అన్నది ఎవరూ ఊహించలేరు. దానినే విధి అంటారు. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులు వందలలో మరణించి ఉంటారని అనధికార సమాచారంగా ఉంది.
అదే భారీ విమానం మృత్యు విహంగంగా మారి ఏకంగా వైద్య విద్యార్థుల వసతి గృహం మీద పడడంతో ఏకంగా 20 మంది దాకా మెడికోలు మరణించి ఉంటారని అంటున్నారు. ఆ సమయం చూస్తే మధ్యాహ్నం ఒకటిన్నర గంటలు దాటుతోంది. లంచ్ సమయంగా ఉంది. దాంతో వైద్య విద్యార్ధులు హాస్టర్ లో లంచ్ చేస్తూండంగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని అంటున్నారు దాంతో ఆ సమయంలో వారు లంచ్ చేస్తున్నారని చెబుతున్నారు నోట్లో అన్నం ముద్ద నోట్లో ఉండగానే అనంతలోకాలకు వారు వెళ్ళిపోయారని అంటున్నారు.
ఇది నిజంగా దారుణం అని అంటున్నారు. వారు విమానం ఎక్కలేదు, ప్రమాదంతో ఏ విధంగానూ చూసినా సంబంధం లేదు, కానీ నడి నెత్తిన పడిన అతి పెద్ద బోయింగ్ విమానం వారి ఉసురు అలా తీసింది. కలలో కూడా ఊహించని విధంగా ఇది జరిగింది అని అంటున్నారు. నిజానికి చూస్తే ఎటువంటి విమాన ప్రమాదాలు జరిగినా కూడా జన వాసాల మీద పడకుండా తగిన జాగ్రత్తలు చివరి నిముషంలో తీసుకుంటారు అని అంటారు. అయితే ఇక్కడ అలా తీసుకోవడానికి కూడా ఏ మాత్రం వీలు లేకుండా పోయి ఉంటుందని పరిస్థితి మొత్తం పైలెట్ కో పైలెట్ కంట్రోల్ లో లేకుండా పోయిందని అంటున్నారు.
అందుకే ఏకంగా ఏడు వందల అడుగుల ఎత్తు నుంచి ఒక భారీ విమానం వచ్చి ఏకంగా వైద్య విద్యార్ధుల వసతి గృహాల మీద పడిందని అంటున్నారు. దాంతో విమానంలో ఉన్న 169 మందితో పాటు వసతి గృహంలో ఉన్న మరో ఇరవై మంది దాకా వైద్య విద్యార్ధులు కూడా బలి అయి ఉంటారని అంటున్నారు. దీనిని కనుక ఆలోచిస్తే మృతుల సంఖ్య భారీగానే పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. విమానం నడిపే పైలెట్ కో పైలెట్లకు వేలాది కిలోమీటర్లు నడిపిన అనుభవం ఉంది. విమానంలో ఏ విధమైన టెక్నికల్ లోపాలు తలెత్తినా అవి చాలా దూరం వెళ్ళిన తరువాత బయటపడే అవకాశాలు ఉంటాయి.
కానీ టేకాఫ్ అయిన అయిదు నిముషాల వ్యవధి అంటే ఇది అనూహ్యమైన ప్రమాదంగా చెబుతున్నారు. దీనిని మానవ తప్పిదమా లేక సాంకేతిక లోపమా అన్నదే ఊహించలేకపోతున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా భారత దేశ విమానయాన చరిత్రలో అతి ఘోరమైన ప్రమాదం జరిగింది. అభం శుభం ఎరుగని వారు అంతా బలి అయ్యారు. అనేక వందల కుటుంబాలకు పుట్టెడు శోకం మిగిలించింది ఈ ఘోర కలి అని అంటున్నారు. ఇక పూర్తి వివరాలు తెలియాలంటే కొంత సమయం పడుతుంది అని అంటున్నారు.