జగన్ అష్టదిగ్బంధనం - చంద్రబాబు అనూహ్య నిర్ణయం, ఇక..!!


ఏపీ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. ఇక, ప్రజల మధ్యనే తమ బలం నిరూపించుకునేలా రెండు ప్రధాన పార్టీలు నిర్ణయించాయి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను ప్రతీ ఇంటికి పంపాలని డిసైడ్ అయింది. దీనికి కౌంటర్ జగన్ సైతం ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని చెబుతూ.. ప్రజల మధ్య తన పార్టీ నేతలను పంపిస్తున్నారు. అటు జగన్ తో సహా వైసీపీ ముఖ్య నేతలను కేసులు వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో జగన్ ను మరింతగా ఫిక్స్ చేసేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

నే ప్రజల మధ్యలో

ఏపీలో ఎన్నికలు జరిగిన ఏడాది కాలంలో రాజకీయం వ్యూహా ప్రతివ్యూహాలతో అంచనాలకు మించి సాగుతోంది. అధికార కూటమి ఎమ్మెల్యేలను జూలై 2వ తేదీ నుంచి ప్రజల మధ్యకు పంపాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏడాది కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ఇంటింటికీ మంచి ప్రభుత్వం పై సమగ్ర చర్చ జరిగేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇదే సమయంలో అటు మాజీ సీఎం జగన్ ఈ కార్యక్రమానికి కౌంటర్ గా మరో కార్యాచరణ ప్రకటించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మేనిఫెస్టో.. హామీలను గుర్తు చేస్తూ.. ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలకు నిర్దేశించారు. అయిదు వారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగేలా కార్యాచరణ ఖరారు చేసారు. దీంతో, అటు కూటమి.. ఇటు వైసీపీ నేతలు ప్రజల మధ్యకు వెళ్లటం కీలకంగా మారింది.

దిశా నిర్దేశం

ఇక, ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటింటికీ మంచి ప్రభుత్వం కార్య క్రమం ఎలా నిర్వహించాలి.. ప్రజలకు ఏమేం వివరించాలన్న అంశాలను చర్చించడంతోపాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నమోదు చేసిన విజయాలపై సదరు సమావేశంలో అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజ కవర్గ ఇన్‌చార్జులు, పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొనాలని పార్టీ ఆదేశించింది. ఏడాది కాలంలోనే ప్రభుత్వం సాధించిన విజయాలు.. తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు ఏ విధంగా వివరించాలో చంద్రబాబు మార్గదర్శకం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసారు.

టార్గెట్ జగన్ 

ఇక, వైసీపీ అటు టీడీపీకి కౌంటర్ గా 'చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..' పేరుతో కార్ యక్రమం చేపట్టనుంది. దీంతో, వైసీపీని ఫిక్స్ చేసే విధంగా తమ కార్యక్రమం ముందుకు తీసు కెళ్లటం పైన చంద్రబాబు చేసే సూచనలు కీలకం కానున్నాయి. జగన్ వరుస పర్యటనలు.. వివాదా ల గురించి వివరించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించిన సత్తెనపల్లి పర్యటన.. ముగ్గురు ప్రాణాలు కోల్పోవటం.. జగన్ కారు కింద పడి సింగయ్య ప్రాణాలు వదలటం వంటి అంశాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. ఇటు జగన్ తన పైన నమోదైన కేసు లో హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది. జగన్ ను ఫిక్స్ చేసే విధంగా కూటమి నాయకత్వం కొత్త అడుగులు వేస్తోంది. ఇటు జగన్ కౌంటర్ రాజకీయం మొదలు పెట్టారు. దీంతో, రెండు పార్టీల మధ్య మొదలైన హోరా హోరీ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi