ANDRAPRADESH, KADAPA: పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్న సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి టీడీపీకి షాక్ ఇచ్చారు. కడపలో చాలా ఘనంగా మూడు రోజుల పాటు జరిగింది. ఎటు చూసినా పసుపు రెపరెపలతో సందడి చేసింది. ఇంకేముంది పులివెందులలో కూడా జగన్ ఓటమి ఖాయమని ఇదే ఉత్సాహంతో చంద్రబాబు సహా నేతలు అంతా అనేశారు. వైసీపీకి ఏమీ బలం లేదని తేల్చేశారు.
అయితే మహానాడు జరిగిన పది రోజుల తేడాలో అదే కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్న సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఆయన కేవలం రెండు లైన్లలో తన రాజీనామా లేఖ రాసి బాబుకు పంపించారు. అందులో ప్రజలు అనుచరుల మనోభావాలను గౌరవిస్తూ ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నట్లుగా చెప్పడం విశేషం. కూటమి పాలనకు ఏడాది పూర్తి అవుతున్న నేపధ్యంలో బలమైన నేత పార్టీకి రాజీనామా చేయడం గ్రౌండ్ లెవెల్ లో మారుతున్న పరిణామాలకు సంకేతమా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఇక రాజంపేటలో 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిగా సుగవాసి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. తన ఓటమికి సొంత పార్టీ వారే కారణం అని వైసీపీ నేతలతో చేతులు కలిపి తనను ఓడించారు అని సుగవాసి గతంలో ఆరోపించారు. ఆ మీదట ఆయన సొంత పార్టీ వారి మీద వారి దందాల మీద అధినాయకత్వానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. చివరికి విసిగి వేసారి రాజీనామా చేశారు అని అంటున్నారు.
ఆయన రాజీనామా వెనక వైసీపీ ఉందని ప్రచారం సాగుతోంది. ఇదంతా రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి స్కెచ్ అని అంటున్నారు. ఇక కడపలో వైసీపీని పూర్తిగా బలోపేతం చేసే చర్యలలో భాగంగానే సుగవాసిని తొందరలో వైసీపీలోకి తెస్తారు అని కూడా అంటున్నారు. అంతే కాదు టీడీపీ బలంగా ఉంది వైసీపీ పని అయిపోయింది అని పసుపు పార్టీ నేతలు చేస్తున్న ప్రచారానికి ఇది కౌంటర్ ఎటాక్ అంటున్నారు. కడపలో బాబు జరిపిన మహానాడుకు జగన్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు.
తన ఇంట్లో సైకిల్, తన ఇంటి మీద పసుపు జెండా తన ఒంట్లో టీడీపీ మీద భక్తిని నిండుగా నింపుకున్న సుగవాసి లాంటి సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేయడం అంటే బిగ్ షాక్ టీడీపీకి అని అంటున్నారు. అంతే కాదు సీమలో టీడీపీలో వర్గ పోరు చాలా చోట్ల ఉందని దాంతో మరింత మంది మీద వైసీపీ కన్నేసిందని దాని ఫలితాలు కూడా తొందరలో ఉంటాయని చెబుతున్నారు.
మొత్తానికి కడప తన అడ్డా అని వైసీపీ మరోసారి చెబుతోంది. ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే మొత్తం రాయలసీమ వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అన్నది తొందరలోనే మరోసారి అధికార కూటమిని గట్టిగా నిరూపించే పనిలో వైసీపీ బిజీగా ఉందని అంటున్నారు. చూడాలి మరి సీమ నుంచి మొదలైన ఈ పొలిటికల్ వార్ లో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఏమిటో.