ANDRAPRADESH, KAKINADA, PITAPURAM: దీంతో మా ఊరి చెరువులో మట్టి తగ్గటానికి మీకు హక్కు ఉందా అంటూ ? ఆ వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనలో అప్పుడే గ్రూపుల గోల మొదలైంది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే జనసేనలో గ్రూపుల గోలతో పాటు చీలికలు వచ్చేసాయి. అసలు పిఠాపురంలో ఓ వైపు తెలుగుదేశం పార్టీ నాయకులకు.. జనసేనకు అస్సలు పొసగడం లేదు.
ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే ప్రతి రోజు భగ్గుమంటోంది. దీనికి తోడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా రెండు పార్టీల మధ్య ఉన్న గొడవను మరింత ముదిరేలా చేశాయి. ఇక తాజాగా నియోజకవర్గ కేంద్రమైన పిఠాపురం మండలంలో మట్టి తవ్వకాల కోసం జరిగిన గొడవలు ముదిరి జనసేన లోని రెండు వర్గాలు వీధికి ఎక్కాయి. పిఠాపురం మండలం ఫక్రుద్దీన్ పాలెం లో మట్టి తవ్వకాల విషయంలో పార్టీలోని రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి.
జనసేనకే చెందిన మాజీ ఎంపీపీ కురుమళ్ళ రాంబాబుపై మరో వర్గం జనసేన నాయకులు దాడి చేశారంటూ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది. ఈ వివాదం వాస్తవానికి ఇటుక బట్టీలకు మట్టి తరలింపు విషయంలో మొదలైంది. చెరువులో మట్టి తవ్వకాల కోసం అధికారుల అనుమతుల కోసం ఓ వర్గం ప్రయత్నిస్తుండగా .. మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకాల అనుమతుల కోసం మేం కష్టపడితే.. మట్టిని మీరు ఎలా తరలిస్తారు ? అంటూ మాజీ ఎంపీపీ .. రాంబాబు మరో వర్గం జనసేన నాయకులు కలిసి వచ్చి ఇటుక బట్టి యజమానులను నిలదీశారు.
దీంతో మా ఊరి చెరువులో మట్టి తగ్గటానికి మీకు హక్కు ఉందా అంటూ ? ఆ వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ముదిరి చివరికి ఒకరు పై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. తర్వాత రెండు వర్గాల నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకునేందుకు పిఠాపురం పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. ప్రస్తుత ఈ ఘటంతో పిఠాపురం జనసేన రాజకీయం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సంబంధిత శాఖ అధికారులు చెరువులో మట్టితోలకానికి సంబంధించి ఉన్న అనుమతులపై విచారణ చేస్తున్నట్లు సమాచారం.