TELANGANA: తెలంగాణవిశ్వవిద్యాలయంలో కామర్స్ విభాగం ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య గోపిశెట్టి రాంబాబు నియామక వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు ఆదేశాలమేరకు రిజిస్ట్రార్ ప్రో ఎం. యాదగిరి నియామకపు ఉత్తర్వులుఅందించారు.
అర్థశాస్త్ర విభాగంలో 18 సంవత్సరాల బోధన పరిశోధన అనుభవం కలిగిన ఆచార్య గోపిశెట్టి రాంబాబు తెలంగాణవిశ్వవిద్యాలయంలో కామర్స్ విభాగం హెడ్ గా చైర్మన్ బిఓఎస్ గా అకాడమిక్ పదవులు సమర్థవంతంగా నిర్వహించినారు.
ప్రస్తుతం డీన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన పై నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు అప్పజెప్పినందుకు వైస్ ఛాన్స్లర్ రిజిస్ట్రార్ కు తోటి అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.
