బీజేపీ మీద గుర్రుగా టీడీపీ ? కూటమి కడితే ప్రయోజనం ఏమిటి..


కూటమి కడితే ప్రయోజనం ఏమిటి అన్న చర్చ తమ్ముళ్ల నుంచి పెద్ద నేతల దాకా మొదలైంది అని అంటున్నారు. బీజేపీతో పొత్తు అంటే ఎగిరి గంతేసి పెట్టుకుంది తెలుగుదేశం. అదే ఈ రోజు కొంప ముంచుతోందా అంటే అవును అంటున్నారు. అసలు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి ఏపీలో ఆరు ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం కంటే వల్లమాలిన ఆలోచన వెరేది ఉండదని అంటున్నారు. బీజేపీతో పొత్తు అని వెంపర్లాడటం వల్లనే కమలం పార్టీ ఏపీని కూటమిని లైట్ తీసుకుంటోందా అన్నా చర్చ నడుస్తోంది. వ్యవస్థలు తమకు సహకరించేలా చూసేందుకే పొత్తు అంటే ఈ రోజుకీ అది జరగడం లేదు అన్నది టీడీపీ శిబిరంలో వినిపిస్తున్న మాట. ఈ రోజు కూడా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే దర్జాగా పనిచేస్తోంది అని కూడా వాపోతున్నారు. ఏపీలో అధికారుల నుంచి అంతా తమ మాట ఎక్కడా వినడం లేదు అన్న బాధ ఉంది. 

కీలక ప్లేస్ లలో పోస్టింగులు కొత్తవి వేయాలని ఉన్న వారిని బదిలీ చేయాలని గత పదిహేను రోజులుగా డిమాండ్ల మీద డిమాండ్లు పెడుతూంటే కూడా పట్టించుకోలేదు అని అంటున్నారు. ఇక వీటికి పరాకాష్ట అన్నట్లుగా గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్ గా చేశారు. అది టీడీపీ కూటమి విజయావకాశాలను భారీగా దెబ్బ తీసేలా ఉందని అంటున్నారు. దీంతో బీజేపీ మీద టీడీపీ మంట ఒక్కలా లేదు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఏపీలో ఏమి జరుగుతోంది. కూటమి కడితే ప్రయోజనం ఏమిటి అన్న చర్చ తమ్ముళ్ల నుంచి పెద్ద నేతల దాకా మొదలైంది అని అంటున్నారు. 

బీజేపీ నుంచి అనుకున్న సాయం అందడం లేదని బాధ అయితే ఉందిట. పోలింగ్ కి ఇంకా 13 రోజులు మాత్రమే టైం ఉంది. అతి తక్కువ టైం అయినా విలువైనది. ఈ టైం లో అయినా బీజేపీ దారికి వచ్చి కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోతే పొత్తు పెటాకులే తప్ప ఉపయోగం ఏమిటి అని అంటున్నారు. ఏది ఏమైనా 2014లో ఇలా జరగలేదని గుర్తు చేసుకుంటున్నారు. ఒకసారి పొత్తు పెట్టుకుని మధ్యలో విడిపోయి మళ్ళీ కలిస్తే మనసులు కలవలేదని ఆ కాపురం ఇలాగే ఉంటుందని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో కూటమి ప్రచార భారం అంతా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నారు. బీజేపీ నుంచి అగ్ర నేతలు వస్తారని చూసినా అది జరగలేదు. 
 
ఇక కూటమి తరఫున మ్యానిఫేస్టోని ప్రధాని మోడీ చేతుల మీద అవిష్కరిద్దామని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మోడీ ఏపీ పర్యటన వరసబెట్టి వాయిదా పడుతుండడంతో చంద్రబాబు పవన్ మాత్రమే ఆవిష్కరిస్తున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీ ఏపీ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటేనే తప్ప కూటమిలో ఐక్యత కనిపించేలా లేదు అని అంటున్నారు. అదే విధంగా కూటమి సాఫీగా సాగాలన్నా కమలం తనదైన తీరులో సాయం అందించాల్సి ఉందని అంటున్నారు.