చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యము: కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు


చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రీ శ్రావ్య పేర్కొన్నారు. నగరంలోని 17వ డివిజన్లో ఇంచార్జి బస్వా రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రెడ్దిక వీధి. న్యూ కాలనీ తదితర ప్రాంతాల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మరదలు డాక్టర్ సి. హెచ్. హరితతో కలసి పర్యటించారు. 


ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ పధకాలు, మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. వైకాపా అయిదేళ్ల పాలనలో అన్ని వర్గాల వారిపై ఆర్ధికభారం పడిందన్నారు. ప్రభుత్వం ముందుచూపు లేకుండా ఇష్టరాజ్యంగా అప్పులు చేయడంతో ప్రజలపై అప్పులభారం పడనుందని తెలిపారు. పెరిగిన ధరలతో సామాన్యుల జీవనం దుర్బరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ బాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడును ఎంపీగా, గొండు శంకర్ ను ఎమ్మెల్యే గా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బస్వా మల్లిఖార్జునరెడ్డి, బస్వా నాని, దుంగ భాస్కర్, రవి, శ్రీధర్, మల్లేశ్,చినరాజు, వివిధ డివిజన్ల ఇంచార్జిలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.