రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించటమే జగన్మోహన్ రెడ్డి పన్నాగం: టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కొమ్మరాజు సత్యనారాయణ


ఆంధ్రప్రదేశ్, అమరావతి/ ఏలూరు: ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి, రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా చేసిన వ్యక్తి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని టిడిపి రాష్ట్ర వాణిజ్య విభగం ఉపాధ్యక్షులు కొమ్మరాజు సత్యనారాయణ అన్నారు.

ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో రైతును పరామర్శించడానికి వెళ్లి మిర్చి యార్డ్ లో విధ్వంసం చేయడం, అమరావతి మహిళలను కించపరిచే విధంగా అమరావతిని వేశ్యల రాజధాని అనడం, గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టుగా రప్పా రప్పా నరుకుతాం అన్న మాటలను సమర్థించడం సరైనది కాదని అన్నారు.

దళిత కులానికి చెందిన వ్యక్తి తన కారు కింద పడి ప్రాణాలు కోల్పోతే ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. వైసీపీ నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాటలకు సోషల్ మీడియాలో కత్తులు గొడ్డళ్లు చూపిస్తూ విన్యాసం చేస్తున్నా వారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నానని తెలిపారు. సహనాన్ని కోల్పోయి విచక్షణ రహితంగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో తిరిగి హక్కు లేదని, వారిని ప్రజల్లో తిరగడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదని పోలీసు శాఖ వారిని ఈ సందర్భంగా కోరుతున్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభగం ఉపాధ్యక్షులు కొమ్మరాజు సత్యనారాయణ తెలిపారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi