ANDRAPRADESH, PALNADU: వైసీపీ నాయకురాలు.. మాజీ మంత్రి విడదల రజనీ వ్యవహారం.. మరింత బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రజనీపై పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన శ్రీలక్ష్మి స్టోన్ క్రషర్ యజమాని పెట్టిన ముడుపుల కేసు కొనసాగుతోంది. దీనిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
ఈ ఒక్కటేకాకుం డా.. మరిన్ని విషయాలు కూడా.. రజనీకి చుట్టుకునే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు.. అంతకు ముందు కూడా.. ఏయే వ్యవహారాలు జరిపారన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు.
ఈ కేసులో రజనీ మరిది.. విడదల గోపీని అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈయ నను నేడో రేపో.. పోలీసు కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విచారణ కేంద్రంగా రజనీ వ్యవహారాన్ని పూర్తిగా రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా.. ఒక్క స్టోన్ క్రషర్ కేసు మాత్రమే కాకుండా.. రజనీ వ్యవహారంలో మరిన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
రజనీకి మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందని సమాచా రం. స్టోన్క్రషర్ యజమానిని బెదిరించిన కేసులో 2.2 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నా యి. అయితే.. ఇలానే ఇతర క్రషర్ యజమానులను కూడా బెదిరించి ఉంటారని.. అయితే.. వారు ఏ ఇతర కారణాలతోనో బయటకు వచ్చే అవకాశం లేదని.. ఇప్పుడు గోపీని విచారించడం ద్వారా.. మరిన్ని విషయాలు వెలుగులోకి తీసుకురావాలన్నది అధికారుల వ్యూహం.
ఇప్పటికే విచారించి ఐపీఎస్ అధికారి.. పల్లె జాషువా కూడా.. గోపీని కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. ఒక్క శ్రీలక్ష్మి సంస్థ నుంచే కాకుండా.. ఇతర సంస్థలను కూడా బెదిరించారని ఆయనే చెప్పుకొచ్చారు. అయితే.. ఆయా విషయాల్లో తన ప్రత్యక్ష ప్రమేయం లేదని చెప్పినట్టు ఇటీవల అధికారులు తెలిపారు. ఈ క్రమంలో విడదల ఫ్యామిలీ.. ఇంకెంత మందిని బెదిరించింది? ఎంతెంత వసూలు చేసిందన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీని ప్రకారం.. రజనీపై మరిన్ని కేసులు నమోదు కావడం ఖాయమని తెలుస్తోంది.