ANDRAPRADESH, AMBEDKAR KONASEEM, MUMMIDIVARAM: మృత్యు ఘోషతో గోదావరి కన్నీరు పెడుతోంది. రెండు రోజులు వ్యవధిలో 11 మంది గోదావరిలో దిగి ప్రాణాలు విడిచారు. ఒక ఘటనలో 8 మంది గోదావరిలో మునిగి గల్లంతయ్యారు. ఆ ఘటన గడిచి 24 గంటలు మరొక ముందే మరోచోట ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రెండు ప్రాంతాలు ఒకే జిల్లా కావడంతో ఆ జిల్లా వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం షేర్ లంక ఒక మెచ్యూర్ ఫంక్షన్ కి వచ్చి ఎనిమిది మంది విద్యార్థులు గోదావరిలోకి దిగి గల్లంతైన విషయంలో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన గాలింపు చర్యలు చేపడుతున్న తరుణంలోనే మరోచోట ముగ్గురు గల్లంతయ్యారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం రావిలంక ప్రాంతంలో ముగ్గురు విద్యార్థులు గోదావరిలో స్నానానికి దిగారు. అంతే వారి ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు వీరు నీటిలో దిగినట్లు సమాచారం అందుతుంది. అప్పటినుంచి జాడ లేకపోవడంతో అధికార యంత్రాంగం అక్కడికి చేరుకుని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఏదేమైనా ఒకే జిల్లాలో రెండు చోట్ల విద్యార్థులు గల్లంత కావడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
అమాయూకుల ప్రాణాలు తీస్తున్న ఇసుక బకాసురులు..
ఇది మొదటి సారి కాదు గోదావరి పరివాహక ప్రాంతంలో యాల్ల తరబడి అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్న ఇసుక బకాసురులు ఇలా ఒకటి రెండు కాదు వందల ప్రాణాలు గోదావరిలో కలసి పోతున్నాయి. ప్రభుత్వం ఏదైనా బకాసురుల ముడుపుల్లో మునిగిపోతున్న సంబధిత అధికారులు చిన్న చేపను వెర వేసి పెద్దచేపను పట్టుకున్నట్టు కొంత మంది పార్టీ ముసుగులో ఇసుక దోపిడీకి పాల్పడుతూ సిఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం కొనెదల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆశయాలు తుంగలో తొక్కి పార్టీని తప్పు దారి పట్టిస్తున్న పార్టీ కండువాలు కప్పుకున్న ఇసుక దోపిడీ దారులు నది గర్భములోనికి భారీ వాహనాలను దింపి వందల కొద్ది పెద్ద లారీలతో ఇసుకను తరలిస్తున్నారు. కంటికి కనపడుతున్న అధికారులు పట్టించుకోకపోవడమే అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి మూల కారణం అని అక్కడ ప్రజలు వాపోతున్నారు.