పేదవాడికి ఇళ్లుకు లేని డబ్బులు యోగాకు ఎక్కడి నుంచి వచ్చాయి చంద్రబాబు!.. తాటిపాక మధు


పేద వాళ్ల ఇల్లు కళ కలగానే ఉండాల..
సంక్షేమానికి నిధులు లేవు.. 
యోగాకు ఎక్కడి నుంచి వచ్చాయి..
సీపీఐ మహాసభలో తాటిపాక మధు..

పిఠాపురం, అమలాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ ప్రజలకు ఈ సంవత్సరం ఏ అభివృద్ధి పనులు జరగలేదని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. పేదవాడికి ఇళ్లుకు లేని డబ్బులు యోగాకు ఎక్కడి నుంచి వచ్చాయని కూటమి ప్రభుత్వాన్ని తాటిపాక మధు ప్రశ్నించారు.

స్థానిక సూర్యారాయ గ్రంథాలయంలో పార్టీ16వ నియోజకవర్గ మహాసభ కేశవరపు అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. అంతకుముందు పార్టీ పతకాన్ని మధు ఆవిష్కరించారు. అనంతరం మృతవీరులకు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

ఈ మహాసభను ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ పిఠాపురం నియోజక వర్గంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వందలాది దరఖాస్తులు అధికారులకు ఇచ్చామని ఖాళీ స్థలాలల్లో సీపీఐ భూ పోరాటం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ, ఉప ముఖ్యమంత్రి పవన్ కి లెటర్ వ్రాసిన ఆయన స్పందన లేదని మధు తెలిపారు.

కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జులై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2019లో కరోనా కాలంలో కార్మికుల హక్కులను కాలరాస్తూ బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో నాలుగు లేబర్‌కోడ్లు తీసుకువచ్చిందని తెలిపారు. దీనిలో భాగంగా ఫ్యాక్టరీస్‌, షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనూ 8 గంటల పని స్థానంలో 10 గంటల పనిదినంగా మార్పు చేసిందని తెలిపారు. 

రక్షణ సౌకర్యాలు కల్పించకుండా మహిళలతో రాత్రి షిఫ్టులలో పనిచేయించుకునేందుకు యాజమాన్యానికి స్వేచ్ఛ ఇస్తూ, శ్రామిక మహిళల హక్కులను కాలరాస్తూ చట్టంలో సవరణలు తెచ్చిందని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో సహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపివేయాలని మధు డిమాండ్ చేశారు. జూలై 15, 16 తేదీలలో సామర్లకోట జరిగే సీపీఐ కాకినాడ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సీపీఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయాలని, కౌలురైతులకు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయడంతోపాటు నూతన కౌలుచట్టం చేయాలని కోరారు. 

ఉపాధిహామీ రోజు వేతనం రూ.600 చెల్లించాలని, పట్టణ ప్రాంతాల్లోనూ పథకం అమలు చేయాలని, కనీస పెన్షన్‌ రూ.9,000 చెల్లించడంతోపాటు సిపిఎస్‌ రద్దుచేసి ఓపిఎస్‌ అమలు చేయాలని విద్యుత్‌ సవరణ చట్టం రద్దు చేయాలని, స్మార్ట్‌మీటర్లు బిగించరాదని, భవన నిర్మాణం, ట్రాన్స్‌పోర్ట్‌, హమాలీ కార్మికులతో సహా అసంఘటిత రంగ కార్మికులందరికీ సాంఘిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయడంతోపాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు మినిమం టైమ్‌స్కేల్‌ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మత్స్య కార్మికులు అందరికీ వేట నిషేధభృతి చెల్లించాలని కోరారు. వీటిపై జూలై 9న రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ ప్రాంతంలో ఆందోళనలకు పిలుపు నిచ్చాయని, ఈ నేపథ్యంలో సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.
దళిత సర్పంచ్‌ను అవమానించిన బిజెపి ఎమ్మెల్యే పార్థసారథిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ 

సీపీఐ పిఠాపురం పట్టణ కార్యదర్శి శాఖ రామకృష్ణ మాట్లాడుతూ తల్లికి వందనం మున్సిపల్ తదితర ప్రభుత్వం ఆప్కోస్ కార్మికులకు వర్తిపు చేయాలని కోరారు. ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఇంకా ఈ సభలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవాని, అరుణ, సీపీఐ నాయకులు రెడ్డి గోవింద్, లెనిన్ తదితరులు ప్రసంగించారు.