కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.....
ANDHRAPRADESH:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాలో: కొత్తపేట మండలం మోడేకుర్రు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర కిట్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం అందజేశారు.
ఎమ్మెల్యే విద్యార్థులతో ముచ్చటించి పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని వారితో అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi