WORLD NEWS: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తన స్వరాన్ని ప్రపంచవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తన స్వరాన్ని ప్రపంచవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ లతో పాటు మరికొంతమందికి.. అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకర గ్రూపుగా అవతరించిన అల్ ఖైదా అరేబియన్ పెనున్సులా నుంచి హెచ్చరికలు వచ్చాయి. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది.
తాజాగా ఉగ్ర సంస్థ అల్ ఖైదా అరేబియన్ పెనున్సులా విభాగం ఓ సంచలన ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా కీలక మంత్రులను, వైట్ హౌస్ సిబ్బందిని హతమారుస్తామంటూ వెల్లడించింది. ఈమేరకు ఆ సంస్థ నాయకుడు సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ దాదాపు 30 నిమిషాల నిడివితో ఉన్న ఓ వీడియో విడుదల చేశాడు. అతడి తలపై ఇప్పటికే అమెరికా 6 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.
ఈ సందర్భంగా గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చిన సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ... యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సె, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఎలాన్ మస్క్ సహా.. వైట్ హౌస్ తో సన్నిహిత సంబంధాలున్న ప్రతిఒక్కరిని, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొంటామని హెచ్చరించాడు.
అల్ ఖైదా అరేబియన్ పెనున్సులా సంస్థ యెమెన్ కేంద్రంగా పనిచేస్తోంది. అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత ఇది అత్యంత ప్రమాదకర గ్రూపుగా అవతరించింది. సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ ఆ గ్రూపు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. అతడు గతంలో పలుమార్లు అమెరికాపై దాడికి పిలుపునిచ్చాడు. గతంలో అమెరికాలో యూదులపై జరిగిన దాడులను పొగుడుతూ మాట్లాడాడు.
ప్రస్తుతం అతడి తలపై రూ.50 కోట్ల రివార్డు ఉంది. అల్ ఖైదాలో ఈ పెనెన్సులా విభాగమే ఇప్పుడు అత్యంత చురుగ్గా పనిచేస్తోంది. గతంలో ఇది ప్రమాదకర దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా... 2009 అండర్ వేర్ బాంబర్ కుట్ర, 2015లో చార్లె హెబ్డోపై దాడి ఈ సంస్థ చేసిన పనే. దీంతో అమెరికా విదేశాంగశాఖ ఈ సంస్థను ఉగ్రజాబితాలో చేర్చింది.