ANDRAPRADESH: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఏడుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద ఆటోను కారు ఢీకొంది. వెంకటరావుపల్లి నుంచి పలువురు కూలీలు పొగాకు గ్రేడింగ్ పనులకు ఆటోలో తెల్లపాడు వెళ్తుండగా ఏఎస్రావుపేట క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు: నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీలు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గ్భ్రాంతి వ్యక్తం చేసిన లోకేశ్: నెల్లూరు జిల్లా ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొగాకు గ్రేడింగ్ కోసం వెళ్తున్న కూలీలు మృతిచెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఇద్దరు మృతి బాధాకరమని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.