భారత్ లో విమాన ప్రమాదం... పాకిస్థాన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!


INDIA, WORLD NEWS: తాజాగా పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ స్పందించారు. ఈ వార్త విని చాలా బాధపడ్డానని, భారత ప్రజలకు తన ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు దేశ విదేశాలకు చెందిన 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 


ఈ ప్రమాదంపై పాకిస్థాన్ నుంచి స్పందన తెరపైకి వచ్చింది. భారత్ లో జరిగిన విమాన ప్రమాదంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై దేశ విదేశాల నుంచి నాయకులు, అధినేతలు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ స్పందించారు. ఈ వార్త విని చాలా బాధపడ్డానని, భారత ప్రజలకు తన ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. 

ఈ ఘటనపై బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లో చాలా మంది బ్రిటీష్ పౌరులు కుప్పకూలిపోవడంతో లండన్ వస్తున్న విమాన దృశ్యం చాలా భయంకరంగా ఉందని.. తనకు క్షణక్షణం సమాచారం అందుతోందని.. ఈ విచార సమయంలో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ... భారత్ లో జరిగిన విమాన ప్రమాదం చాలా బాధాకరమని.. ఈ ప్రమాదంలో యూకే, కెనడా, పోర్చుగల్.. ఇలా ఇతతర దేశ ప్రయాణికులు కూడా ఉన్నారని.. వీరంతా ప్రమాదానికి గురైనందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత ఎక్కువమంది ప్రాణాలతో బయటపడాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

ఇదే సమయంలో... అహ్మదాబాద్ సమీపంలో ఎయిరిండియా విమానానికి జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు తెలిపారు. ఇదే సమయంలో... భారత్ లో జరిగిన విమాన ప్రమాదం తమను ఎంతో బాధించిందని, బాధితులు త్వరగా కోరుకోవాలని భారత్ లోని కెనడా హైకమిషన్ పేర్కొంది.