టెక్సాస్ వరద బీభత్సం.. వైరల్ వీడియో ఇదిగో!


28 మంది చిన్నారులు సహా 80 మంది మృతి

కళ్ల ముందే వంతెన గల్లంతు.. కెమెరాకు చిక్కిన భయానక దృశ్యాలు

సమ్మర్ క్యాంపు నుంచి 27 మంది బాలికలు గల్లంతు

కొద్ది గంటల్లోనే 10 అంగుళాల భారీ వర్షపాతం

ANDHRAPRADESH:అమెరికాలోని సెంట్రల్ టెక్సాస్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ జల ప్రళయంలో చిన్నారులతో సహా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది బాలికలు గల్లంతయ్యారు. వరదల తీవ్రతకు అద్దం పడుతూ, కేవలం రెండు నిమిషాల్లో ఓ భారీ వంతెనను నది మింగేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. జులై 4న టెక్సాస్‌లో కొద్ది గంటల వ్యవధిలోనే 10 అంగుళాల భారీ వర్షం కురిసింది. ఆ ప్రాంతంలో మూడో వంతు వార్షిక వర్షపాతంతో ఇది దాదాపు సమానం. దీంతో నదులు ఒక్కసారిగా ఉప్పొంగి ఆకస్మిక వరదలు సంభవించాయి. ముఖ్యంగా కెర్ కౌంటీలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఈ ఒక్క కౌంటీలోనే 40 మంది పెద్దలు, 28 మంది చిన్నారులు మరణించినట్టు కౌంటీ షెరిఫ్ లారీ లీథా ధృవీకరించారు. గ్వాడలుపే నది ఒడ్డున ఉన్న ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంప్ నుంచి 27 మంది బాలికలు గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఎన్ఎన్ నివేదికలు తెలిపాయి.

మరోవైపు, కింగ్స్‌ల్యాండ్‌లోని లానో నదిపై ఉన్న ఓ రోడ్డు వంతెనను ఉప్పొంగిన వరద కేవలం రెండు నిమిషాల్లోనే పూర్తిగా ముంచెత్తిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్న నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి వంతెనను కబళించడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. 
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now