ఆగిరిపల్లి ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు


*నేటి బంగారు కుటుంబాలే... రేపటి మార్గదర్శులు
*సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి
*ఆగిరిపల్లి ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

నూజివీడు/ఆగిరిపల్లి/ఏలూరు: సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న 10 శాతం మంది అట్టడుగున ఉన్న 20 శాతం పేదలను పైకి తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పిలుపునిచ్చారు. పేద కుటుంబాల్లో వెలుగు తెచ్చేవరకు అండగా ఉంటానని, నేడు బంగారు కుటుంబానికి ఎంపికైన వారి పిల్లలే సహకారం అందిస్తే రేపు మార్గదర్శుకులుగా తయారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సమాజంలో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గాలని అభిప్రాయపడ్డారు. ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, ఆగిరిపల్లిలో జ్యోతిరావుపూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బంగారు కటుంబం-మార్గదర్శి కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శులను సీఎం సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.... ఆగిరిపల్లిలోని 206 బంగారు కుటుంబాలకు వారి మార్గదర్శులు అండగా ఉంటారు. మొదటి దశలో రాష్ట్రంలోని 20 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.


పేదలను ఆదుకుని శాశ్వతంగా పైకి తీసుకొస్తే పూలేను గుర్తు పెట్టుకున్నట్లుగానే మార్గదర్శుకులను గుర్తుంచుకుంటారు. ఒక స్థాయి వరకు సొంతానికి, వ్యక్తిగతంగా కష్టపడతాం, తర్వాత మంచి పేరు కోసం కష్టపడతాం. అలాంటి వేదిక కోసమే ఈ మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యక్రమం. మార్గదర్శకులు ఓట్లు కోసం రావడం లేదు, పేరు కోసం ముందుకు వస్తున్నారు. అంబేద్కర్, పూలే, జగ్జీవన్ లాంటి మహానుభావుల జయంతి వేడుకులు నిర్వహించుకుంటూనే పీ4 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

బంగారు కుటుంబాలకు ఎంపికైన వారు మాట్లాడుతూ...
ప్యారీ రేష్మ, ఆగిరిపల్లి:
నా భర్త డ్రైవర్‌గా పని చేస్తున్నారు. మాకు సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నాం. మా ముగ్గరు పిల్లన్ని చదివించుకోవడానికి సాయం కోరుతున్నాను. ఆస్తులు ఏమీ లేవు. 

బోనం లక్ష్మీదుర్గా, ఆగిరిపల్లి:
నా భర్త బోన్ క్యాన్సర్‌తో మూడేళ్ల క్రితం చనిపోయారు. నాకు పింఛన్ కూడా రావడం లేదు. నాకు పాప, బాబు ఉన్నారు. సొంతిల్లు లేక నా తల్లిదండ్రులతో ఉంటున్నాను. పూట గడవడం కోసం కూలీ పనులకు వెళ్తున్నాను. జీవనోపాది కల్పించాలని కోరుతున్నా. 

సీఎం చంద్రబాబు నాయుడు:
వచ్చే నెల నుంచే మీకు పింఛను మంజూరు చేయడంతో పాటు 12 నెలల పింఛను కూడా ఇస్తాం. సొంతిల్లు కూడా కట్టించి ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటాం.  

మార్గదర్శకులు మాట్లాడుతూ...
ప్రభాకర్, నూజివీడు సీడ్స్ అధినేత :
 మార్గదర్శి-బంగారు కుటుంబం చాలా మంచి కార్యక్రమం. దేశంలో ఎక్కడా లేని మంచి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. రాబోయే నాలుగేళ్లలో రూ.20 నుంచి 25 కోట్ల వరకూ ఆగిరిపల్లిలోని పేదలకు ఖర్చు చేస్తాం. ఆగిరిపల్లితో పాటు తుక్కులూరు గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడితే ముందుకొస్తాం.  

సిద్ధార్థ, కుశలవ గ్రూప్:
చదువుకోవడానికి ఇబ్బంది పడేవారికి సాయం అందిస్తాం. ఇల్లు లేని వారికి ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఇల్లు నిర్మించి ఇస్తాం. 

గౌతమ్, హ్యాపీ వ్యాలీ స్కూల్ అధినేత:
నేను స్థాపించి హ్యాపీవ్యాలీ స్కూల్‌ను మీరే ప్రారంభించారు. వంద కోట్లు అప్పు చేసి స్కూలు కట్టించాను... ఆ అప్పంతా తీర్చాను. 300 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాం. వారు మంచి జీవితాన్ని ప్రారంభించేదాకా బాధ్యత తీసుకుంటాం. మీ ఇచ్చే పిలుపుతో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. 

నితిన్ కృష్ణ, నితిన్ సాయి కన్‌స్ట్రక్షన్:
ఈ కార్యక్రమం ద్వారా మట్టిలో ఆణిముత్యాలను వెలికి తీసి ఉద్యోగాలు ఇస్తాం. 

పిన్నమనేని ధన ప్రకాశ్, మోడల్ డైరీ:
హీల్ అనే పాఠశాల ద్వారా వెయ్యి మంది విద్యార్థులకు చదువు అందిస్తున్నాం. అనాథ పిల్లలను తీసుకుని చదివిస్తాం. 

రావి వెంకటరావు, ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్:
నాకు మార్గదర్శి సీఎం చంద్రబాబు చెప్పి చేసేవన్నీ చూసి నేర్చుకున్నాం. 60 మందితో ప్రారంభమైన మా కాలేజీలో నేడు 6 వేల మందిదాకా ఉన్నారు. ఎక్కువ మంది కటుంబాలను దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తాం.