అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. షర్మిష్ట ముందే ఎలా చెప్పింది?


INDIA NEWS: దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. జూన్ 12న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 242 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 169 మంది భారతీయులు ఉన్నారు. ఈ దుర్ఘటన నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడటం గమనార్హం. ఈ విషాదకర ఘటనకు సంబంధించి ప్రముఖ జ్యోతిష్యురాలు షర్మిష్ట చేసిన జోస్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

ఆరు నెలల ముందే హెచ్చరిక! 

డిసెంబర్ 29, 2024న షర్మిష్ట తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. "2025లో విమానయాన రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. అయితే ఏడాది ప్రారంభంలోనే ఓ ఘోరమైన విమాన ప్రమాదం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. నేను దీన్ని రెండు నెలల క్రితమే ఊహించాను" అని ఆమె పేర్కొన్నారు.


అంతేకాకుండా జూన్ 5న ఆమె మరో ట్వీట్ చేస్తూ, "టాటా సంస్థ రఫేల్ యుద్ధ విమానాలను హైదరాబాద్‌లో తయారు చేస్తోంది. ఇస్రో కూడా శాటిలైట్ ఇంజనీరింగ్, స్పేస్ టూరిజంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. కానీ 2025లో ఓ భారీ విమాన ప్రమాదం జరగనుందని నాకు గట్టి ఫీలింగ్ ఉంది" అని స్పష్టం చేశారు. ఆమె ఈ పోస్ట్ చేసిన వారం రోజులకే జూన్ 12న ఈ ప్రమాదం సంభవించడం విశేషం.


సోషల్ మీడియాలో హాట్ టాపిక్ 

ఈ ప్రమాదం అనంతరం షర్మిష్ట చేసిన ఈ ట్వీట్లు క్షణాల్లో వైరల్‌గా మారాయి. ఆమె జోస్యం నిజమైందని అనేక మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. షర్మిష్ట జోస్యం నిజం కావడం కేవలం యాదృచ్ఛికమా? లేక ఆమెకు నిజంగానే భవిష్యత్తును ముందుగానే తెలుసునా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.


విమాన ప్రమాదంపై అంతర్జాతీయంగా దిగ్భ్రాంతి 

ఈ ప్రమాదంపై ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. భారత ప్రభుత్వం ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేశంలోని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని సూచనలు జారీ అయ్యాయి.


జ్యోతిష్యంపై పెరిగిన ఆసక్తి 

ఈ సంఘటన జ్యోతిష్య శాస్త్రంపై ప్రజల్లో ఆసక్తిని మరోసారి పెంచింది. షర్మిష్ట జోస్యం నిజమవ్వడం వల్ల, జ్యోతిష్యంలో నిజంగా శక్తి ఉందా? లేక ఇదంతా యాదృచ్ఛికమా అనే చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రశ్నకు కాలమే జవాబు చెప్పాలి.