మహాత్ముడి ముని మనవరాలికి జైలు శిక్ష... షాకింగ్ రీజన్!


WORLD, INDIA NEWS: భారత్ లో ఆయన స్వాతంత్రోద్యమ పొరాటానికి అక్కడ ఎదుర్కొన్న అనుభవాలు కారణమని చెబుతారు.. అక్కడ వారికి కూడా గాంధీ ఓ గొప్ప వ్యక్తిగానే గుర్తుంటారు. దక్షిణాఫ్రికాకు మహాత్మ గాంధీకి ప్రత్యేక సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. భారత్ లో ఆయన స్వాతంత్రోద్యమ పొరాటానికి అక్కడ ఎదుర్కొన్న అనుభవాలు కారణమని చెబుతారు.. అక్కడ వారికి కూడా గాంధీ ఓ గొప్ప వ్యక్తిగానే గుర్తుంటారు. 


అయితే అలాంటి మహాత్మగాంధీ వారసురాలు, ఆయన మునిమనవరాలు అదే దక్షిణాఫ్రికాలో జైలు శిక్ష అనుభవించనున్నారు. మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ వారసురాలు, మునిమనమరాలు ఆషిష్ లత రామ్ గోబిన్ కి దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ఆర్ మహరాజ్‌ ను సుమారు రూ.3.22 కోట్లకు మోసం చేసిన కేసులో ఆమెను న్యాయస్థానం దోషిగా తేల్చింది. పైకోర్టులో అప్పీలు హక్కును కూడా నిరాకరించింది. 

లత రామ్ గోబిన్ వ్యాపారా లావాదేవీల పేరుతో ఎస్ఆర్ మహరాజ్ ను నమ్మబలికి, నకిలీ డాక్యుమెంట్లు చూపి పెట్టుబడి తీసుకున్నారట. ఇందులో భాగంగా... అమ్మకానికి ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు, ముడిసరుకు సరఫరా కోసం డీలింగ్ ఉందని చెప్పి రూ.3.22 కోట్ల రూపాయలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలిందట. దీంతో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.

ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనికితోడు పైకోర్టులో అప్పీలు హక్కును కూడా నిరాకరించిందని తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాంధీ మనవడు మేవా రామ్ గోబిన్ కుమార్తె అయిన లతా రామ్ గోబిన్.. తనను తాను అహింసా మార్గంలో నడిచే వ్యక్తిగా, హక్కుల కార్యకర్తగా చెప్పుకునేవారంట. అయితే తాజా ఘటనతో ఆమె మోసం చేసినట్లు నిరూపితమైంది. గాంధీ సిద్ధాంతాలకు భిన్నంగా చీటింగ్ కేసులో ఆమె దోషిగా తేలి, జైలు శిక్ష అనుభవించాల్సి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.