INDIA NEWS: ఈ ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారని తెలుస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రతీఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. గురువారం మధ్యహ్నం 1:39 గంటల ప్రాంతంలో టెకాఫ్ అయిన తర్వాత కొంత ఎత్తులోకి వెళ్లి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఓ అద్భుతం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అహ్మదాబాద్ పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు!
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎవరూ బ్రతికి లేరని, ఇది షాకింగ్ విషయమని ప్రకటనలు వెలువడినట్లు ప్రచారం జరిగిన కాసేపట్లోనే.. ఓ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడినట్లు అహ్మదాబాద్ పోలీసులు నిర్థారించారు. ఈ సందర్భంగా 11ఏ సీటులో కూర్చున్న ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడని వెల్లడించారు.
ఈ సందర్భంగా స్పందించిన అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్... ఈ ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... 11ఏ నెంబర్ సీట్ లోని ప్రయాణికుడు రమేశ్ బిశ్వాస్ సజీవంగా బయటపడినట్లు తెలిపిన... ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించినట్లు కథనాలొస్తున్నాయి! ఈ సందర్భంగా.. ప్రమాద స్థలం నుంచి గాయాలతో నడుచుకుంటూ వస్తున్న ఆ వ్యక్తి దృశ్యాలు వైరల్ గా మారాయి.
ఎవరీ మృత్యుంజయుడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ, ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఇది కచ్చితంగా అద్భుతం అని కొనియాడుతున్నారు. మరోపక్క ఆ వ్యక్తి నిజంగానే విమానంలోని ప్రయాణికుడా.. లేక, ప్రమాదం జరిగిన జనావాసాల్లోని బాధితుడా అనే చర్చా జరుగుతుంది! ఇదే సమయంలో... ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందే విమానం నుంచి బయటకు దూకాడనే ప్రచారమూ తెరపైకి వచ్చింది. ఏది ఏమైనా ఈ మృత్యుంజయుడు బయటకు వచ్చి, తన అనుభావాన్ని చెబితే తప్ప వాస్తవ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు!