డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం: పరిపాలనలో మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పిస్తూ పరిపాలనలో 50 శాతం రిజర్వేషన్ పార్టీ పదవులలో సైతం రిజర్వేషన్ కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
మహిళల భద్రత కోసం దిశా చట్టాన్ని తీసుకొచ్చి వారి భద్రతకోసం కృషి చేస్తుందని, మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పిస్తూ వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, ప్రతి సంక్షేమ పథకం మహిళల బ్యాంక్ ఖాతాలలో నేరుగా జమచేసి వారి ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు.
ప్రజాప్రతినిధులుగా, ఇల్లాలుగా, అమ్మగా, సోదరిగా, కూతురిగా మన ఇంట్లో సంతోషాలు నింపుతూ వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించుకుని, ఆడపడుచులకు పసుపు, కుంకుమ, గాజులు, చీర, స్వీట్స్ అన్ని ఇచ్చి గౌరవించుకోవడం అదృష్టంగా భవిస్తానని తెలిపారు.