ఎన్నికల మార్గదర్శకాలు నిరుష్పక్షపాతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం: పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిరుష్పక్షపాతంగా మార్గదర్శకాలు ప్రకారం ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా రిటర్నింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా 26 జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులతో తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును అనుసరించి ప్రభుత్వ పబ్లిక్ ప్రైవేట్ బహిరంగ ప్రాంతాలలో హోర్డింగ్స్ కటౌట్లు వివిధ ప్రసార సామాగ్రిని తొలగించాలని, ఈవీఎంల ర్యాoడమైజేషన్, పోలింగ్ సిబ్బంది శిక్షణలు సెక్షన్ 171 ప్రకారం ప్రవర్తన నియమావళి అమలు ప్రతికూల వార్తలపై తీసుకోవాల్సిన చర్యలు సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కా రం, ఇత్యాది అంశాలపై జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేసి అవగాహన పెంపొందించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమాలు ప్రకారం రాజకీయ పార్టీల ప్రకటనలను బహిరంగ ప్రదేశాలలో కటౌట్లు హోర్డింగులు ద్వారా ఉన్నట్లయితే వాటిని గుర్తించి వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం జెండాలు బ్యానర్లు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు స్టాటిస్టిక్స్ సర్వేలన్స్ టీములు మెగా వ్యవస్థ ను పటిష్టంగావించి డబ్బు మద్యం గిఫ్ట్ ఆర్టికల్స్ బల్కుగా రవాణా కాకుండా ఆధారాలు చూపని నిధులను నియమావళి ప్రకారం సీజ్ చేయాలని ఆదేశించారు. మొదటి రెండవ ఈవీఎం ర్యాండైజేషన్ అనంతరం పోలింగ్కు ఈవీఎంలను సన్నద్ధం చేయాలన్నారు. 

అసెంబ్లీ నియోజకవర్గంలో 16 మందికి మించి అభ్యర్థులు పోటీలో ఉంటే రెండవ బ్యాలెట్ యూనిట్ ను సిద్ధం చేయాలన్నారు. ప్రతికూల వార్తలను ప్రతిరోజు ఉదయం గుర్తించి తగుచర్యలు చేపట్టాలన్నారు. సి విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులను 100 నిమిషాలలో పరిష్కరించాలని ఆదేశించారు. గోడల మీద రాతలు పోస్టర్లు ద్వారా ప్రచారం నిషిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రలోభాలకు ఓటర్లను గురి చేస్తే ఆ యొక్క ప్రలోభాలకు గురి చేసే చిత్రాలను  వీడియోలను లొకేషన్ను యాప్ లో పొందుపరిచి సమర్పిస్తే అధికారులు వెంటనే తగు చర్యలు చేపడతారన్నారు. స్వీప్ కార్యక్రమా ల ద్వారా ఓటర్లలో చైతన్యం తీసుకు రావాలని అందుకు రంగోలి వాకర్స్ అసోసియేషన్ ద్వారా టీషర్ట్లు పై ఓటర్ లెన్స్ చైతన్యపరిచే రీతిలో ఓటింగ్ నినాదాలు ముద్రించి విస్తృత ప్రచారం కల్పించాలని, గాలిపటాల ఉత్సవం ద్వారా ప్రచారకార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి ఓటింగ్ శాతాన్ని పెంచాలన్నారు. 

ప్రవర్తన నియమాలు ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్, రాజోలు రిటర్నింగ్ అధికారులు, ముమ్మిడివరం రిటర్నింగ్ అధికారి మదన్ మోహన్ రావు, పి గన్నవరం ఆర్వో శ్రీరామచంద్రమూర్తి, రామచంద్రపురం ఆర్ ఓ ఎస్ సుధా సాగర్, కొత్తపేట ఆర్వో ఎస్ వి వి సత్యనారాయణ, అమలాపురం ఆర్ వో జి  కేశవర్ధన్ రెడ్డి, మండపేట ఆర్వోడి. ఎల్లారావ్, అమలాపురం పార్లమెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి ఎం ఝాన్సీ రాణి, డి ఆర్ డి ఏ పి డి వి శివశంకర్ ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి ఎస్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.