వచ్చే ఆర్ధిక సంవత్సరం జిల్లాలో 9 వేల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగుయేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సభ్యులతో ఏలూరు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ)ని నియమించి, తరువాత సమావేశంలో పూర్తి స్థాయి సభ్యులతో సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులను ఆదేశించారు.
109 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన ఉంగుటూరు-కైకలూరు రోడ్డు నిర్మాణం పనులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, టి. నర్సాపురం - చింతలపూడి, టి..నర్సాపురం - జంగారెడ్డిగూడెం రోడ్ల నిర్మాణ పనులను వెంటనే చేపట్టి పూర్తిచేయాలన్నారు. జిల్లాలో మంజూరైన రోడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, మండలాలలో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలను స్థానిక ఎమ్మెల్యే లకు తెలియజేసి, వారి సూచనలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని ఎంపీ అధికారులను ఆదేశించారు.
దేశంలో 50 ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెంసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, వీటిలో మన జిల్లాలోని కొల్లేరు, పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్ధేందుకు అవసరమైన ప్రతిపాదనలను సమర్పించాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేసారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ పొలం పిలుస్తోంది, పొలం బడి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా నిర్వహించాలన్నారు. భీమడోలు మండలం మల్లవరం, చెట్టున్నపాడు గ్రామాలలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరాగా, ఈనెల 25వ తేదీ మంగళవారం నుండి ఆగడాలలంక ఛానల్ నుండి త్రాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ ఎస్ఈ నాగార్జున తెలియజేసారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా ఇప్పటికే 1830 కోట్ల రూపాయల విలువైన 4302 ఎకరాల ప్రభుత్వ భూమిని ల్యాండ్ బ్యాంకు ద్వారా గుర్తించామన్నారు. పారిశ్రామిక జోనల్ ప్లాన్ ను రూపొందిస్తామన్నారు. జిల్లాలో ఏప్రిల్ 10వ తేదీన జాబ్ మేళా నిర్వహించి వెయ్యిమందికి ఉపాధి కల్పించే దిశగా ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ హబ్ ల ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి, ప్రతీ నెలా జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాని, సీడాప్ ద్వారా ఇప్పటికే 826 మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పింఛామన్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ సేకరణకు పారిశ్రామిక, బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం జిఎస్ డబ్ల్యూఎస్ నుంచి ఒక అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తామన్నారు.
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుండి రక్షిత త్రాగునీటి పథకాలలో ఫిల్టర్ బెడ్స్ మార్పుచేయాలన్నారు. త్రాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ లు మరమత్తులు కారణంగా ట్యాంకులను శుభ్రం చేయడంలేదని, ఓవర్ హెడ్ ట్యాంకులను మెట్లు వంటి వాటికి మరమ్మత్తులు చేపట్టి, ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. 2019 కి ముందు తమ ప్రభుత్వ హయాంలో గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణాలను చేపట్టామని, కానీ వాటిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో నిర్మాణ పనులు సగంలోనే నిలిచిపోయాయన్నారు.
వాటిని పూర్తి చేయాలనీ విజ్ఞప్తి చేశారు. విజ్జేశ్వరం నుంచి గోదావరి నీరు పైప్ లైన్ల ద్వారా సరఫరా చేయాలన్న ప్రతిపాధనలకు ప్రత్యమ్నాయంగా ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు జానంపేట వద్ద పోలవరం ప్రాజెక్ట్ కుడిప్రధాన కాల్వ నుండి గోదావరి జలాలను పైప్ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాధించాలని సూచించారు.
చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలనీ కోరారు. చింతలపూడి నియోజకవర్గంలో పరిశ్రమలను మంజూరు చేసి నియోజక అభివృద్ధి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ కె. భీమేశ్వరరావు, డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూ ఎస్ సూపరింటెండింగ్ ఇంజినీర్లు నాగార్జునరావు, త్రినాధ్ బాబు, వ్యవసాశాఖాధికారి హబీబ్ భాష, ఉద్యానవన శాఖ డిడి రామ్మోహన్, డిఎంహెచ్ ఓ డా. మాలిని, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, మైక్రో ఇరిగేషన్ పీడీ రవికుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ. భానుప్రతాప్, ప్రభృతులు పాల్గొన్నారు.