INDIA NEWS: అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం జనావాసాల్లో పడింది. ఇందులో కొన్ని భాగాలు అక్కడే ఉన్న బీజీ మెడికల్ కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ హాస్టల్ భవనాలపై పడ్డాయి.
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు! బయలు దేరిన కొన్ని క్షణాలకే విమానం జనావాసాల్లో కుప్పకూలిపోయింది. ఈ సమయంలో ప్రత్యక్ష సాక్షుల కథనాలు కథనాలు తెరపైకి వచ్చాయి.
అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం జనావాసాల్లో పడింది. ఇందులో కొన్ని భాగాలు అక్కడే ఉన్న బీజీ మెడికల్ కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ హాస్టల్ భవనాలపై పడ్డాయి. దీంతో ఒక చోట భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కనీసం 15 నుంచి 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
ఈ విమానం బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన సమయంలో ఓ పెద్ద శబ్దంతో అగ్నిగోళంగా మారిందని.. ఇది భూకంపంలా అనిపించిందని ప్రమాద స్థలానికి పరుగెత్తుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి చెప్పాడు! దట్టమైన బూడుదరంగులో పొగ అలుముకొందని.. విమాన శకలాలు, మృతదేహాలు, బిల్డింగ్ శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని చెప్పాడు.
మరోవైపు ప్రమాదం జరిగిన నిమిషాల్లో సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో పలువురిని సురక్షితంగా బయటకు తీశారని తెలుస్తోంది. ప్రస్తుతం మూడు ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వడోదర నుంచి మరో రెండు బృందాలను తరలిస్తున్నారు. ప్రమాద స్థలి నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వరకు గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశారు.