తమ కుమార్తె ఫ్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కలక్టర్ దంపతులు
ఏలూరు, ప్రతినిధి: ఒక జిల్లా ఉన్నతాధికారి అయివుండి సామాన్యుడిలా జిల్లా కలెక్టర్ కూర్చుండిపోయారు. పిల్లల ఫ్రీ గ్రాడ్యుయేషన్ సభలో తల్లిదండ్రులతో పాటు జిల్లా కలెక్టర్ వె ప్రసన్న వెంకటేష్, ఆయన సతీమణి డా.మానస కూర్చుని తమ కుమార్తె రాశ్మి శహస్ర అన్విత ఫ్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఆనందంగా తిలకించారు. సాధారణ తల్లిదండ్రులలాగే కలెక్టర్ దంపతులు హాజరై ఆసాంతం అందరి మధ్యలో కూర్చొనడం చూసిన పలువురు అభినందించారు.
ఏలూరులోని స్థానిక సర్ సి ఆర్ రెడ్డి పాఠశాలలో ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సర్ సి ఆర్ రెడ్డి విద్యాసంస్థల సెక్రటరీ డాక్టర్ ఎం బి ఎస్ వి ప్రసాద్, జాయింట్ సెక్రెటరీ కొడాలి వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దంపతులు పాఠశాలలో ప్రీ ప్రైమరీ చదువుతున్న తమ చిన్నారి గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేశారు. వారిద్దరూ తల్లిదండ్రుల మధ్య కూర్చుని తమ చిన్నారి ఫ్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఆనందంతో తిలకించారు.
సర్ సి ఆర్ రెడ్డి విద్యాసంస్థల సెక్రటరీ డాక్టర్ ఎం బి ఎస్ వి ప్రసాద్ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే అనేది ప్రీ ప్రైమరీ విద్యార్థుల మొక్క భవిష్యత్తుకు కొత్త పునాదులు వేసేదిగా ఉంటుందని ఇది కేవలం విద్యార్థులకే కాదు తల్లిదండ్రులకు కూడా గర్వించదగ్గ రోజు అని తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని వారితో ఆటపాటల్లో పాల్గొనాలని అలా చేస్తే పిల్లలకు తల్లిదండ్రులపైన అపారమైన ప్రేమ ఏర్పడుతుందని, అంతేకాక తల్లిదండ్రులకు తగిన వ్యాయామం కూడా లభిస్తుందని, విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించడానికి సర్ సి ఆర్ రెడ్డి విద్యాసంస్థలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయన్నారు.
పాఠశాల ప్రిన్సిపల్ సాయికుమారి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను, సమాజం పట్ల గౌరవభావాన్ని, పరిశుభ్రత, సమయపాలన యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విద్యను అందించి వారిని భవిష్యత్తులో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడమే మా పాఠశాల ప్రధాన ధ్యేయమని తల్లిదండ్రులకు తెలియజేశారు. కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్ని తమ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ II విద్యార్థులు తమ పాఠశాల అనుభవాలను ఉపన్యాసం పంచుకుని మరియు నృత్యప్రదర్శన ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రీ ప్రైమరీ II విద్యార్థులు తమ నృత్య ప్రదర్శన ద్వారా అలరించి ప్రీ ప్రైమరీ II విద్యార్థులకు వీడ్కోలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ II నుండి ఫస్ట్ క్లాస్ కు ప్రవేశం పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వంకినేని రఘు కుమార్, పాఠశాల డైరెక్టర్ రాజ కళా శ్రీధరి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.