ఇరాన్ లో ముగ్గురు ఇండియన్స్ మిస్సింగ్.. కిడ్నాపర్ల డిమాండ్స్ ఇవే!


INDIA NEWS: ఈ ముగ్గురిని పసుపు రంగు తాళ్లతో కట్టి, వారి చేతుల నుంచి రక్తం కారుతున్న వీడియోను కిడ్నాపర్లు పంపారని.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వారిని చంపేస్తామని అన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరాన్ కు వెళ్లిన ముగ్గురు భారతీయులు మిస్సయ్యారనే విషయం తీవ్ర కలకలం రేపుతోంది. టెహ్రాన్ కు మే 1న చేరిన వీరు అప్పట్నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చెప్పినట్లు అక్కడి ఇండియన్ ఎంబసీ పేర్కొంది. వెంటనే వారి ఆచూకీ కనిపెట్టి రక్షించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు కిడ్నాపర్ల నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది!


పంజాబ్ లోని సంగ్రూర్, హోషియార్ పూర్, ఎస్.బి.ఎస్. నగర్ నుంచి ఇరాన్ కు వెళ్లిన ముగ్గురు భారతీయులు తప్పిపోయారని టెహ్రాన్ లోని భారతీయ రాయబార కార్యాలయం ధృవీకరించింది. వారిని వెంటనే కనుగొని, వారికి భద్రత కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ఆ ముగ్గురిని హుషన్ ప్రీత్ సింగ్, జస్పాల్ సింగ్, అమృత్ పాల్ సింగ్ లు గుర్తించారని సమాచారం.

పంజాబ్ లోని ఒక ఏజెంట్.. దుబాయ్ – ఇరాన్ మార్గం ద్వారా వీరిని ఆస్ట్రేలియాకు పంపుతానని హామీ ఇచ్చాడని.. వారికి ఇరాన్ లో బస కల్పిస్తానని చెప్పారని తెలుస్తోంది. ఈ క్రమంలో మే 1న వారు ఇరాన్ లో అడుగుపెట్టినప్పటి నుంచీ కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ సమయంలో కిడ్నాపర్లు రూ.కోటి డిమాండ్ చేశారని కుటుంబ సభ్యులు తెలిపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

ఈ ముగ్గురిని పసుపు రంగు తాళ్లతో కట్టి, వారి చేతుల నుంచి రక్తం కారుతున్న వీడియోను కిడ్నాపర్లు పంపారని.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వారిని చంపేస్తామని అన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే... మే 11 తర్వాత కిడ్నాపర్ల నుంచి తమకు ఫోన్స్ రావడం ఆగిపోయాయని అన్నారు. మరోపక్క వీరిని విదేశాలకు పంపిన ఏజెంట్ కనిపించకపోవడంతో అతడిపై కేసు నమోదైంది.