మోడీకి సింధూర్ ఇవ్వడానికి భార్య లేదు కాబట్టి అతనికి సింధూర్ విలువ తెలియదు!


INDIA NEWS: ఈ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతే దీటుగా స్పందించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'పై మోదీ చేసిన వ్యాఖ్యలపై దీదీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఆపరేషన్‌ను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని ఆరోపిస్తూ, ప్రధాని తన భార్యకు ఎందుకు సిందూర్ పెట్టరంటూ సూటి ప్రశ్న సంధించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. -అలీపుర్‌దుర్‌లో మోదీ వ్యాఖ్యలు 


ఇటీవలే పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దుర్‌లో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'ఆపరేషన్ సిందూర్' ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో హింస జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సభలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి సుకాంతా మజుందార్‌లు 'ఆపరేషన్ బెంగాల్'ను చేపట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బంగాళఖాతంలో కలిపేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. 

-మమతా బెనర్జీ దీటుగా సమాధానం అయితే, 
ఈ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతే దీటుగా స్పందించారు. ప్రధాని మోదీ సహా బీజేపీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం ఘటనపై దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందన్నారు. 'ఆపరేషన్ సిందూర్'తో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడామని పేర్కొన్నారు. "తామంతా ఒక్కటే, ఉగ్రవాదాన్ని సహించేది లేదు, ఐక్యతే మా బలం" అనే సందేశాన్ని తెలియజేయడానికి అఖిలపక్ష ప్రతినిధులు విదేశాల్లో పర్యటిస్తున్న సందర్భంలో ప్రధాని మోదీ ఇలా మాట్లాడటం చాలా బాధాకరమని అన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల సవాల్ 
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలరా అంటూ బీజేపీ సర్కారును మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఇది బీజేపీ రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఆరోపించారు. -'సిందూర్' వివాదం మోదీ తనను తాను మొదట 'చాయ్‌వాలా' అని చెప్పుకున్నారని, ఆ తర్వాత 'గార్డు' అన్నారని, ఇప్పుడు 'సిందూర్' అమ్మడం ప్రారంభించారని మమత ఎద్దేవా చేశారు. సిందూర్ మహిళలకు గర్వకారణమని, ప్రతి మహిళ తన భర్త నుంచి సిందూర్ తీసుకుంటుందని పేర్కొన్నారు. "సిందూర్‌ను ఇలా అమ్మకూడదు. అంతేకాకుండా, ప్రధాని మోదీ తన భార్యకు సిందూర్ ఎందుకు పెట్టడం లేదు?" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీదీ ఈ స్థాయిలో చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.