INDIA, WORLD NEWS: ఊహించిన పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఎప్పటినుంచో భయపడినది నిజమైంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. By: BCN TV NEWS బలూచిస్తాన్ సైన్యం ఈ మేరకు ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. దశాబ్దాలుగా బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా చూడాలని అక్కడి తిరుగుబాటు దళాలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాయి. తమ పోరాటంతో పాకిస్తాన్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. బలూచిస్తాన్ దళాల నుంచి తమను కాపాడుకోవడానికి పాకిస్తాన్ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ దళాలు మాత్రం వెనకడుగు వేయలేదు. సరిహద్దుల్లో పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలించాయి. అత్యాధునిక ఆయుధాలతో దాడులు చేస్తూ పాకిస్తాన్ సైన్యానికి నరకం చూపించాయి.
ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలను అవకాశంగా తీసుకున్న బలూచిస్తాన్ తిరుగుబాటు దళాలు, పాకిస్తాన్ సైన్యంపై మరింతగా విరుచుకుపడ్డాయి. వందలాది మంది పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టి తమ సత్తా చాటాయి. ఇతర దేశాల మద్దతుతో పాకిస్తాన్కు కష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోక తప్పలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించడంతో బలూచిస్తాన్ దళాలు సంబరాలు చేసుకుంటున్నాయి.
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన:
"ఇది ఎన్నో సంవత్సరాల పోరాటం. లెక్కలేనన్ని త్యాగాల ఫలితంగా వచ్చిన గుర్తింపు ఇది. మేము సాధించిన స్వేచ్ఛ అమూల్యమైనది. ఈ స్వాతంత్య్రం మాటల్లో వర్ణించలేనిది. ఇది మా యోధుల త్యాగాల ఫలితం. నిస్సందేహంగా మేము మమ్మల్ని గొప్పగా పాలించుకుంటాం. అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటాం. ప్రపంచం మమ్మల్ని ఆశ్చర్యంగా చూసేలా అడుగులు వేస్తాం" అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి విడిపోయి తాము స్వతంత్ర దేశంగా ఏర్పడ్డామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.
అంతేకాకుండా, క్వెట్టా నగరంలో కొత్త పార్లమెంట్ భవనం యొక్క ఫోటోలను, జాతీయ చిహ్నాన్ని, జాతీయ గీతాన్ని సోషల్ మీడియాలో విడుదల చేసింది. భారత్తో సహా ఇతర దేశాలలో తమ రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం కోసం తాము ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని, ఆ పోరాటం ఇప్పుడు నిజమైన రూపం దాల్చిందని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. "ఇది మా పోరాటానికి దక్కిన విజయం. మా త్యాగాలకు లభించిన గౌరవం. ఇదంతా ఇప్పుడు నిజంగా జరుగుతోంది. ఇంతకంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదు" అని బలూచిస్తాన్ ఆర్మీ భావిస్తోంది.