ఏలూరు: సర్వే పూర్తి కాబడిన గ్రామముల యందు వెబ్ ల్యాండ్ 2.0 లో జాయింట్ పట్టాదారులుగా నమోదు కాబడిన భూ యజమానులు వారియొక్క భూములను విభజన చేయుటకు ప్రభుత్వంవారు నిర్దేశించిన 500 రూపాయల రుసుమును పూర్తిగా మినహాయించి ఉచితముగా ఈ సేవను పొందుటకు అవకాశము కల్పించడమైనదని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి చెప్పారు.
దీనికి గాను కేవలము నామమాత్రపు దరఖాస్తు రుసుము 50 రూపాయలను గ్రామ సచివాలయము నందు చెల్లించి జూన్ 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకొనవలసినదిగా జేసీ ధాత్రిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సదవకాశమును జాయింట్ పట్టాదారులు అందరూ ఉపయోగించుకుని జాయింట్ పట్టాలను విడివిడిగా విభజన చేయించుకోవలసినదిగా కోరారు.
దీనివలన ప్రభుత్వ సంక్షేమ పథకములైన "అన్నదాత సుఖీభవ", "తల్లికి వందనం" మరియు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకములకు అర్హులుగా గుర్తించబడతరణి, కావున జాయింట్ పట్టాదారులుగా నమోదు కాబడిన భూ యజమానులు జాయింట్ పట్టా విభజన కొరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలసినదిగా జేసీ తెలియజేసారు.