INDIA NEWS: ఏమీ చదవు రాని మంత్రసాని నూటికి 99% శాతం ఫ్రీ డెలివరీ లు చేస్తే... MBBS, DGO లు, MD DGO లు చదివి నార్మల్ డెలివరీ చేయలేని డాక్టర్లు దాదాపు 80% మంది మన దేశంలో ఉన్నారు. అలాంటిది ఏ చదువు లేకుండా ఎన్నో కాన్పులు పోసి రాష్ట్ర పురుషార్ధాలు పొందిన ఒకావిడ జీవితం మీకోసం...
"సూలగుత్తి నరసమ్మ" 98 సంవత్సరాల వయస్సున్న ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని, కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తాండాలలో ప్రక్రృతి వైద్యం చేస్తుంది.
ముఖ్యంగా గర్భవతులకు సుఖప్రసవం చేయించడంలో ఈవిడ దిట్ట. ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్త శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రక్రృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలదు. Specialist గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు సైతం ఈవిడ ప్రతిభకు అబ్బురపడుతారు., బెంగుళూరులోని అనేక Multi/Super Speciality ఆసుపత్రుల డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా ఉన్నారు.,
తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది, తల ఏ దిశలో ఉంది, ఉమ్మనీరు పరిస్థితి, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యం ఏమైనా ఉందా, ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు, సిజేరియన్ తప్పనిసరా, పుట్టబోయే బిడ్డ బరువు ....వంటి విషయాలు ఖచ్చితంగా చెబుతుంది., ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది.
“సూలగుత్తి” అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది "దాయినీ (మిడ్వైఫ్)" లేదా మంత్రసాని అని అర్ధం. ఈమె 1920 సంవత్సరంలో నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమె కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా, గాజనూరు గ్రామానికి చెందినవారు. ఈమె తన జీవిత కాలంలో 15,000 పైగా ప్రసవాలు చేసింది., తను ఎటువంటి డబ్బులూ తీసుకోదు., ఎవరైనా తనకు డబ్బులు గాని, బహుమతులు గానీ తన ఇంటికి పంపిస్తే వాటిని ఆవిడ స్వయంగా పంపించినవారి ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంది., ఆమె రోజువారీ వ్యవసాయ కూలీగా బ్రతికేరు.
Tumkur యూనివర్సిటీ ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సామాన్య మహిళలకు వైద్య సేవలు అందించడంలో ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2018లో ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. గౌరవాలు & పురస్కారాలు 2018 సంవత్సరంలో "పద్మశ్రీ పురస్కారం" "జనపద ఫెలోషిప్ అవార్డు" "ఆర్యభట అవార్డు" ఆమె సేవలను గుర్తించి అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలు అందించబడ్డాయి. 2018 డిసెంబర్ 25న నరసమ్మ తన 98వ యేట కన్నుమూశారు. నేడు, ఆమె పేరు గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో అంకితభావంతో సేవలందించే వారందరికీ ప్రేరణగా నిలుస్తోంది.